శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి గం.10.00ల నుండి
శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రత్యేకం. నిష్ణాతులైన 11 మంది అర్చక
స్వాములు, వేదపండితులు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4గంటలకు పైగా
జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం ప్రత్యేకం.
ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు
ఫలోదకాలతోనూ ఈ అభిషేకం ప్రత్యేకం.
లింగోదృవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
బ్రహ్మోత్సవాలలో ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికిS
తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా
కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను
అనుసంధానం చేస్తూ అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి
రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను
అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరించారు. దిగంబరుడై పాగాను అలంకరించిన
సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ
చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల
మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు తనయుడు పృథ్వీ సుబ్బారావు స్వయంగా
తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించారు.