శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,22, 53, 862/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 20 రోజులలో ( 02.08.2024 నుండి 22.08.2024 వరకు) సమర్పించారన్నారు. ఈ హుండీలో 150 గ్రాముల, 100 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల, 250 గ్రాముల వెండి లభించాయని పేర్కొన్నారు.అదేవిధంగా 746 – యుఎస్ఏ డాలర్లు, 20 – యూరోలు, 1- మలేషియా రింగిట్స్ 125– కెనడా డాలర్లు, 70 – యుకె పౌండ్స్, 26 – సింగపూర్ డాలర్లు, 50 – యూ.ఏ.ఈ దిర్హమ్స్ ఖతార్ రియాల్స్, 1 – ఓమన్ రియాల్స్, 50- ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని తెలిపారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని ఈ ఓ తెలిపారు. ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారిణి ,ఆయా విభాగాల పర్యవేక్షకులు, పలువురు శాఖాధిపతులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.