శ్రీశైల దేవస్థానం: శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో దేవస్థానం నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాల నిర్మాణపు పనులను గురువారం సాయంత్రం కార్యనిర్వహణాధికారి లవన్న ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈ ఓ మాట్లాడుతూ నిర్మాణపు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నిర్మాణంలో పూర్తిగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని, ఏ చిన్నపనిలో కూడా నాణ్యతపరంగా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.
కాగా దేవస్థానం సిబ్బంది కోసమై శ్రీశైలంప్రాజెక్టు కాలనీలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణాన్ని దేవస్థానం చేపట్టడం జరిగింది.
మొత్తం 3 నమూనాలలో అనగా 1 – బి హెచ్ కె స్మాల్, 1 – బిహెచ్ కె బిగ్ మరియు 2 బిహెచ్ కె బిగ్ పేర్లతో వీటిని దేవస్థానం నిర్మిస్తున్నది.సిబ్బంది కోసమై మొత్తం 297 వసతి గృహాలు నిర్మించబడుతున్నాయి.
ఈ గృహ నిర్మాణపు పనులు పూర్తి కావడాన్ని అనుసరించి దేవస్థానం సిబ్బందిని సున్నిపెంటకు తరలించడం జరుగుతుంది.ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు వి. రామకృష్ణ, మురళీధరరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐ/సి) చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీర్లు పాల్గోన్నారు.
*Inspection at Ganga Sadan by Executive Officer Lavanna
*Inspection at Kalyana Katta
* Inspection at Dormitary
* Inspection at Pathleswara Sadan
*Inspection at Pathala Ganga