శ్రీశైల దేవస్థానం:ప్రజలు రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనావైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెండకుండా నశించేందుకు చేపట్టిన శీతలాదేవి హోమ కార్యక్రమం ఈ రోజు ( 11.06.2021) న ముగిసింది.
లోకకల్యాణార్థం గత 21 రోజులు గా, గత నెల 22వ తేదీ నుండి ప్రతీరోజు ఈ విశేషహోమంజరిగింది.
ఈ 21 రోజులు కూడా శీతలాజపం, మహావిద్యాపారాయణలు, వేదసూక్త పారాయణలు జరిగాయి.
రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విశేష కార్యక్రమాలుచేసారు. దేవస్థానం అర్చకులు, వేదపండితులు ఈ జపపారాయణలను చేసారు.
శీతలాదేవి హోమం, శీతలాజపాలవలన అమ్మవారు లోకాలను చల్లగా చూస్తారని నమ్మకం.
అందుకే ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనే ప్రతి రోజు ఈ హోమ జపపారాయణలను చేసారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో వుంచుకుని భౌతిక దూరం పాటిస్తూ , అర్చకస్వాములు, వేదపండితులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు .
*ఈ రోజు అంకాళమ్మ విశేష పూజ, ఊయల సేవ ఘనంగా జరిగాయి.