శ్రీశైలం స్వామి అమ్మవార్లకు బంగారు హారాలు. వెండి కిరీటాలు విరాళంగా అందాయి . సోమవారం ఈ కానుకలు అందాయి . విజయవాడకు చెందిన గంగవరపు ఓబులనాయిడు , విజయలక్ష్మి దంపతులు వీటిని విరాళంగా అందించారు . వీటి విలువ రూ. పది లక్షలకు పైగా ఉంటుందని వారు తెలిపారు . అమ్మవారికి బంగారు మామిడి పిందెల హారం, స్వామి వారికి బంగారు గుండ్ల హారం , స్వామి అమ్మవార్ల కల్యాణ ఉత్సవ మూర్తులకు వెండి కిరీటాలు సమర్పించారు . వీటిని ఆలయ అధికారులు ఎస్ .వి . కృష్ణా రెడ్డి , సహాయ కార్యనిర్వహణాధికారి గంటి రాధాకృష్ణ అవధాని , వేద పండితులు , పీ ఆర్ ఓ. టి .శ్రీనివాస రావుకు అందించారు . వీటికి ఆలయ అర్చకులు , వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణను నిర్వహించారు . అనంతరం దాతలకు దేవస్థానం వారు వేద ఆశీర్వచనం చేయించి ప్రసాదం అందించారు . వీరిని onlinenewsdiary.com అభినందిస్తోంది.