శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అన్ని ఏర్పాట్లతో భక్తులను అలరిస్తున్నాయి . సోమవారం , మంగళవారం అనేకానేక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి . స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి .యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపారు . జపాలు జరిపారు . మండపారాధనలు ,పంచావరణ అర్చనలు ,నిత్య హవనాలు , రుద్రహోమ కార్యక్రమాలు తదితరాలు ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు . ఆదివారం సాయంత్రం నందివాహన సేవ జరిగింది . స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపించారు . ఆదివారం రాత్రి శ్రీ పార్వతి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జరిపించారు . ప్రతిరోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారి కల్యాణం జరుపుతారు. మకర సంక్రాంతి రోజు శ్రీ పార్వతి మల్లికార్జున స్వామి వారి కల్యాణం విశేషం. మంగళవారం పుష్పపల్లికి సేవ జరిగింది . 21 రకాలకు పైగా పుష్పాలు , పత్రాలు వాడి అలంకరించిన పల్లకిలో ఊరేగించారు . సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు .
బుధవారం పూర్ణాహుతి
బుధవారం ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతః కాల పూజలు అనంతరం గ .9.౩౦ని .లకు స్వామి వారి యాగశాలలో రుద్రహోమ పూర్ణాహుతి ఉంటుంది . కలశోద్వాసన , త్రిశూల స్నానం , వసంతోత్సవం జరుపుతారు . సాయంత్రం గ . 7 నుంచి ధ్వజా అవరోహణ కార్యక్రమం ఉంటుంది .