29 వ పాశురము :
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్.
- అత్యంత వేకువ జామున వచ్చి దేవరవారిని సేవించి బంగారు తామర పుష్పమువంటి శ్రీ పాదములకు మంగళాశాసనము చేయుటలో అభిప్రాయము వినుమా. పశువులను మేపే కులములో పుట్టిన నీవు అంతరంగ కైంకర్యములను అంగీకరింపక పోకూడదు.నేడు ఒక ప్రయోజనము సాధించుకుని , పోవుటకు, వచ్చిన వారము కాము. ఏడేడు జన్మలకును , ఎప్పటికినీ దేవరవారి సంబంధులమే అగుదుము . దేవరవారికే కైంకర్యములను చేయుదుము . ఇతరములగు మా కోరికలను తొలగింపుము .
- ధ్వని : ఉపేయ స్వరూపమును వివరించుటయే ఈ పాశురము అంతరార్థము . సత్వగుణ అభివృద్ధికి సూచకము .కైంకర్యములను చేయు మార్గములో దోషములను పోగొట్టాలని విన్నపము .