సమాచార పౌర సంబంధాల శాఖ లో తెలంగాణ మాగజైన్ ఉర్దూ ఎడిటర్ హబీబుద్దీన్ ఖాద్రీ అకస్మిక మరణం పట్ల కమిషనర్ అర్వింద్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. ఖాద్రీ సమాచార శాఖకు చేసిన సేవలు ఎనలేనివని , మంచి అధికారిని కోల్పోయామని అన్నారు. ఉర్దూ ట్రాన్స్ లేటర్ గా సమాచార శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఉర్దూ ఎడిటర్ స్థాయికి ఎదిగారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ పండుగల సందర్భంగా వీరు ఉర్దూ వాఖ్యాతగా పని చేశారు. ప్రస్తుతం వీరు ఒక్కరే ఉర్దూ విభాగాన్ని చూసే అధికారి అని స్వతంత్రంగా తెలంగాణ మాస పత్రిక ను ఉర్దూలో వెలువరిస్తున్నారని, ఉర్దూ సమావేశాలకు సంబంధించి అన్ని విషయాలు చూస్తున్నారని, ఆయన మరణం సమాచార శాఖ కు తీరని లోటు అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కమి షనర్ తెలిపారు. సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే , ఎఫ్.డి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్.ఎల్.ఆర్. కిశోర్ బాబు, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు డి.ఎస్.జగన్ , ఎన్.వెంకటేశ్వర్ రావు, అధికారులు, సిబ్బంది తమ సంతాపం తెలిపారు.