మచిలీపట్నం కోనేరు సెంటర్లో మంగళవారం జరిగిన జగన్ బహిరంగ సభ, భారీగా తరలివచ్చిన ప్రజలు.
బందర్ పోర్ట్ కు 4,800 ఎకరాలు ఎక్కువని ఎద్దేవా చేసిన తెలుగుదేశం, ఈ ప్రభుత్వానికి ఇప్పుడు 33 వేల ఎకరాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు.
బందర్ లో పరిశ్రమ కు చేయూత నివ్వకుండా,
50వేల మంది ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమను నష్టాల బాటలో కూరుకుపోయినా, ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ ప్రస్తావించారు.
లక్ష అరవై వేల డిఎస్సి పోస్టుల కోసం ఎదురుచూస్తున్నా , ఏపీపీఎస్సీలో ఇంకా భర్తీ చేయకుండా తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు . వై.యస్.ఆర్.సి.పి అధికారంలోకి రాగానే పోస్టులు భర్తీ చేస్తామని జగన్ చెప్పారు.
25 ఎంపీలను ఇవ్వండి , ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు . పొత్తులు ఉండవు , ప్రజలకు ఏమి కావాలో అలాగే పరిపాలన అందిస్తా . చంద్రబాబు మోసపు మాటలు నమ్మకండి . ఇకనైనా జాగ్రతగా ఉండండి అని పిలుపు .