Minister KTR gave away a reward of Rs 2,11,111 to GHMC worker T Venkataiah named ‘Best Worker in India’. Union Ministry for Urban Development has selected T Venkataiah for Best Worker Award under SwachhBharat.
Venkataiah has been working as sanitation worker, continuously since last 16 years in GHMC, without taking a leave.
Minister instructed GHMC officials to make all arrangements for Sri Venkataiah’s journey to receive the award from Prime Minister Sri Narendra Modi Ji.
జాతీయ ఉత్తమ పారిశుద్య కార్మికుడికి మంత్రి కేటిఆర్ నజరానా
– మంత్రి సొంతంగా 1,11,111 రూపాయాలు అందించిన మంత్రి
– జీహెచ్ఎంసి తరపున మరో లక్ష రూపాయల చెక్కు
– వెంకటయ్య సేవలను అభినందించిన మంత్రి
– స్వచ్చ హైదరాబాద్ నినాదానికి వెంకటయ్య సేవలు స్పూర్తి అన్న మంత్రి
జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన వెంకటయ్యను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు 2,11,111 రూపాయల నగదుతో పాటు శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు.
స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జాతీయ స్థాయిలో ఇద్దరు కార్మికులను ఎంపిక చేయగా వీరిలో జీహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్కు చెందిన పారిశుధ్య కార్మికుడు వెంకటయ్యకు అవార్డు లభించింది. వెంకటయ్యకు లభించిన పురస్కారానికి స్పందించిన మంత్రి కె.టి.రామా రావు వ్యక్తిగతంగా 1,11,111 రూపాయల చెక్కును వెంకటయ్యకు అందజేశారు. దీంతో పాటు జీహెచ్ఎంసి నుండి మరో లక్ష రూపాయల చెక్కును వెంకటయ్యకు అందజేశారు.
నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డిల సమక్షంలో సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి కె.టి.రామా రావు వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. వెంకటయ్య నగరానికి చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.
దేశం మొత్తంలో కేంద్ర మున్సిపల్, పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ కేవలం ఇద్దరు కార్మికులను ఉత్తమ కార్మికులుగా గుర్తించగా వీరిలో గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న టి.వెంకటయ్య ఉండడం అభినందనీయమన్నారు.
వెంకటయ్యను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆప్యాయంగా మాట్లాడారు. పనిలో ఎన్నేళ్ళ కింద చేరావు, సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్న తీరుపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంకటయ్య కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీల్లీలో అవార్డు తీసుకునేందుకు వెళ్తున్న వెంకటయ్యకు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసి సిబ్బందిని కోరారు. తన పరిధిలోని రోడ్లను పరిశుభ్రంగా ఉంచకుంటే తనకు నిద్రకూడా రాదని, అందుకే ప్రతిరోజు గత పదహారు సంవత్సరాలుగా ఒక్కరోజు సెలవు లేకుండా పనిచేస్తున్నట్లు మంత్రికి వెంకటయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిన వెంకటయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరు తమ తమ రంగాల్లో అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. స్వచ్చ హైదరాబాద్ లక్ష్యాన్ని చేరుకునేందుకు వెంకటయ్య లాంటి కార్మికుల పనితీరు, సేవాభావమే స్పూర్తి అన్నారు.
స్వచ్చనగర కల సాకారం కావాలంటే ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. నగరంలో పనిచేసే ప్రతి ఒక్క సానిటేషన్ వర్కర్ కు వెంకటయ్య ఆదర్శమన్న మంత్రి మరోవైపు నగరంలో ఇష్టారీతిన చెత్త వేసే ప్రతి ఒక్కరు వెంకటయ్యలాగా కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించాలని కోరారు.