
శ్రీశైల దేవస్థానం:మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం ఆదివారం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించారు. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిగాయి.
ఈ ఉదయం ఆలయ మహాద్వారం నుంచి కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, స్వామివారి ప్రధానార్చకులు శివప్రసాద్ స్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు పి. మార్కండేయశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి.మోహన్, పలువురు అర్చకస్వాములు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపి బోనాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా సకాలంలో వర్షాలు కురిసి ,పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, అగ్నిప్రమాదాలు, వాహనప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, రోగకారక పరిస్థితులు రాకుండా ఉండాలని, జనులందరికి ఆయురారోగ్యాలు చేకూరాని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాని ఈ సంకల్పములో చెప్పారు.
తరువాత అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించారు.
కాగా అంకాళమ్మఅమ్మవారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించడం ఇదే మొట్టమొదటిసారి. ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం కూడా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది.