
శ్రీశైల దేవస్థానం:మంగళవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 3,57,81,068/-
నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో (20.12.2022 నుండి 16.01.2023 వరకు) సమర్పించారని వివరించారు.ఈ నగదుతో పాటు 103 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 520 గ్రాముల వెండి లభించాయని తెలిపారు.
యుఎస్ఏ డాలర్లు – 243, యుఏఈ దిర్హమ్స్ – 220, సింగపూర్ డాలర్లు – 61, ఆస్ట్రేలియా డాలర్లు -175, కెనడా డార్లు – 20, యూరో – 150, ఇంగ్లాండ్ ఫౌండ్స్ – 25, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ తెలిపారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును జరిగిందని ఈ ఓ తెలిపారు. ఈ కార్యక్రమం లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారన్నారు.