
శ్రీశైలదేవస్థానం: శ్రీశైల మహాక్షేత్ర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వ సన్నధంగా ఉన్నామని దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఈ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవస్థానం చేసిన సమగ్ర ఏర్పాట్లను వివరించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 22.02.2022 నుండి 04.03.2022 వరకు 11 రోజులపాటు జరుగుతాయని ఈ ఓ తెలిపారు. • 22వ తేది ఉదయం 8గంటలకు యాగశాల ప్రవేశం తో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.4వ తేదీన రాత్రి పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని ఈ ఓ తెలిపారు. సంప్రదాయ రీతిలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు , మౌలిక సదుపాయాలు ఘనంగా ఉంటాయని వివరించారు. ఈ ఓ ప్రకటించిన పూర్తి వివరాలు ఇవి.
- ముఖ్య కార్యక్రమాలు : • 22.02.2022 – ధ్వజారోహణ,
- • 23.02.2022 – భృంగివాహనసేవ,
24.02.2022 – హంసవాహనసేవ, 25.02.2022 – మయూరవాహనసేవ, 26.02.2022 – రావణవాహన సేవ
27.02.2022 – పుష్పపల్లకీసేవ • 28.02.2022 – గజవాహనసేవ • 01.03.2022 – మహాశివరాత్రి – ప్రత్సవం – నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం – పాగాలంకరణ – స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం • 02.03.2022 – రథోత్సవం – తెప్పోత్సవం • 03.02.2022 – యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
- 04.03.2022 – అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
- పట్టువస్త్రాల సమర్పణ :
- 22.02.2022 – శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం • 24.02.2022 – శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం • 25.02.2022 – ఉదయం – శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం
సాయంకాలం – తిరుమల తిరుపతి దేవస్థానం • 26.02.2022 – రాష్ట్ర ప్రభుత్వం
చలువ పందిర్లు : • శివదీక్షా శిబిరాలు, గంగాసదన్ వెనుకభాగం, టోల్ గేట్ సమీపంలోని బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్ద బాలగణేశవనం, ఆలయ దక్షిణ భాగంలో రుద్రాక్షవనం, మల్లమ్మకన్నీరు మొదలైన చోట్ల చలువపందిర్లు వేసి భక్తులు సేదతీరేందుకు అవకాశం . సాక్షిగణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదాన భవనము, కల్యాణకట్ట,చండీశ్వరసదనం మొదలైన ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు.
దర్శనాలు
- దర్శనాలు – మూడు క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతి.
- • 1. ఉచిత దర్శనం, 2. శీఘ్రదర్శనం ( రూ. 200/-లు) 3. అతిశీఘ్రదర్శనం ( రూ. 500/-లు) క్యూలైన్లు
ఏర్పాట్లు . • కంకణాలు ధరించి వచ్చిన పాదయాత్ర భక్తులకు, ఆన్ లైన్ ద్వారా ఉచిత దర్శనం రిజిస్ట్రేషన్
పొందిన వారికి కూడా ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు.
విరాళాల సేకరణ ఎదురుగా ఈ క్యూలైన్ ప్రారంభమవుతుంది. • బ్రహ్మోత్సవాలలో రద్దికారణంగా భక్తులందరికీ కూడా 22.02.2022 నుండి 04.03.2022 వరకు స్వామి వార్ల అలంకార దర్శనం మాత్రమే అవకాశం . ప్రత్యేక క్యూలైన్ ద్వారా శివదీక్షా భక్తులకు దర్శనం ఏర్పాట్లు . ఆలయ ఉత్తర భాగంలో చంద్రవతి కల్యాణ మండపం నుంచి శివదీక్షా భక్తల క్యూలైన్ ప్రారంభమవుతుంది.
క్యూకాంప్లెక్స్ :
క్యూకాంప్లెక్స్ లో 14కంపార్టుమెంట్లలో ఉచిత దర్శన భక్తులు వేచివుండే అవకాశం
• 8 కంపార్టుమెంట్లలో శీఘ్రదర్శనం (రూ.200/-లు) క్యూలైన్లో భక్తులు వేచివుండే అవకాశం
. శివదీక్షా భక్తుల సౌకర్యార్థం చంద్రవతి కల్యాణ మండపంలో 4 కంపార్టుమెంట్లు ఏర్పాటు
. • క్యూకాంప్లెక్స్లో దర్శనాలకు వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, సమయాను
సారంగా అల్పాహారం.
ఆన్లైన్లో దర్శన టికెట్లు అందుబాటు : • బ్రహ్మోత్సవాల సందర్భంగా 22.02.2022 నుండి 04.03.2022 వరకు శీఘ్రదర్శనం టికెట్లు (రూ. 200/-) మరియు అతిశీఘ్రదర్శనం (రూ. 500/-లు) టికెట్లు అలైన్లో . • రోజుకు 5000 శీఘ్రదర్శనం టికెట్లు, 2000 అతిశీఘ్రదర్శనం టికెట్లు అలైన్లో
అందుబాటు. • వీటితో పాటు ఉచిత దర్శనం టోకన్లు కూడా ఆన్ లైన్ లో అందుబాటులో. • ఆన్లైన్ టికెటు పొందిన భక్తులు వేకువజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 3.00గంటల వరకు
తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు దర్శనాలను చేసుకోవచ్చు.
శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ :
పాతాళగంగ మార్గములోని శివదీక్షా శిబిరాలలో భక్తులు ఇరుముడి సమర్పణకు ఏర్పాట్లు .
లడ్డు ప్రసాదాలు : • బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 30 లక్షల లడ్డుప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళిక .
మొత్తం 15 కౌంటర్ల ద్వారా లడ్డుప్రసాదాలు . • రద్దీని బట్టి వీటికి అదనంగా మరో 5 కౌంటర్లు కూడా అందుబాటులోకి . • ఈ 5 కౌంటర్లలో ప్రత్యేకంగా 3 కౌంటర్లు మహిళలకు, దివ్యాంగులకు అందుబాటులో.
మంచినీటి సదుపాయం :
• రోజుకు 27 లక్షల గ్యాలన్ల మంచినీరు సరఫరా జరుగుతుంది.
వీటిలో 20 లక్షల గ్యాలన్ల ఫిల్టర్ వాటర్, 7లక్షల గ్యాలన్ల క్లోరినేటేడ్ వాటర్ సరఫరా . • ఫిల్టర్ బెడ్ లో 5 స్టోరేజ్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 54 లక్షల 40వేల లీటర్లు
7 డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. • టూరిస్ట్ బస్టాండ్, అన్నదాన భవనం, శివదీక్షా శిబిరాలు, కొత్తపేట, చంద్రవతి కల్యాణ మండపం,ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం, గాండ్ల సత్రం వెనుకభాగంలలో ఈ డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 33 లక్షల 50వేల లీటర్లు క్షేత్రములో పలుచోట్ల 20 వాటర్ స్టోరేజ్ ట్యాంకులు ( ఆర్.సి.సి మరియు సింథెక్స్ ట్యాంకులు) అందుబాటులో ఉన్నాయి.
మొత్తం 400 పబ్లిక్ కుళాయిలను అందుబాటులోకి. • క్షేత్రపరిధిలో ఆర్టిసి బస్టాండ్, కల్యాణకట్ట, పాతాళగంగ జల్లు స్నానానికి ( షవర్ బాత్) అవకాశం . క్షేత్రపరిధిలో పలుచోట్ల 15 ఆర్.ఓ వాటర్ మంచినీటి ప్లాంట్లను (శివగంగా జలప్రసాద పథకం)
అందుబాటులో . • గంటకు 18,340 లీటర్ల త్రాగునీరు వీటి ద్వారా సరఫరా చేయవచ్చు. పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం : • వెంకటాపురం, నాగలూటి, పెద్ద చెరువు, భీమునికొలను మెట్ల మార్గం. కైలాసద్వారం, హాటకేశ్వరం,
సాక్షిగణపతి మొదలైన చోట్ల మంచినీటి సదుపాయం .
పార్కింగ్ ప్రదేశాలు:
మొత్తం 28.90 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు . హెలిప్యాడ్, ఆగమ పాఠశాల ఎదురుగా ప్రదేశం, యజ్ఞవాటిక, వాసవీ విహార్ వద్ద కారు పార్కింగ్ ఏర్పాట్లు .
రింగురోడ్డు వద్ద ఏ.పి.ఎస్. ఆర్.టి.సి, తెలంగాణ ఆర్.టి.సి. కర్ణాటక ఆర్.టి.సి బస్సులకు పార్కింగ్
ఏర్పాట్లు . • వీటికి అదనంగా ఔటర్ రింగు వెంబడి సుమారు 3 వేల వాహనాలను కూడా పార్కింగ్ చేసుకోవచ్చు.
- టూరిస్ట్ బస్సులు యాత్రికషెడ్ల వద్ద పార్కింగ్ చేయవచ్చు.
- వైద్యసేవలు : • శివసదనం వెనుకభాగంలో గల దేవస్థానం వైద్యశాల, పాతాళగంగ మార్గానికి ఎడమవైపుగల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు .
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 30 పడకల తాత్కాలిక వైద్యశాల కూడా ఏర్పాటు చేయబడుతుంది. మెడికల్ క్యాంపులు : • మొత్తం 13 చోట్ల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయబడుతాయి.
వెంకటాపురం, నాగలూటి, పెద్ద చెరువు, కైలాసద్వారం, హాటకేశ్వరం వద్ద 5 మెడికల్ క్యాంపులు ఉంటాయి. క్షేత్రపరిధిలో టోల్ గేట్, ఆలయమహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల మార్గం, పాతాళగంగ, మల్లమ్మకన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్టాండ్ మొదలైన 8 చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు .
అన్నప్రసాద వితరణ :
- దేవస్థాన అన్నదాన భవనం నుంచి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. • వీటికి తోడు త్రములో పలుచోట్ల స్వచ్చంద సేవాసంస్థల వారు అన్నదానాల ఏర్పాటు . • వీరికి దేవస్థానం పూర్తి సహాయసహకారాలను అందిస్తుంది.
- పాతాళగంగ •
- పాతాళగంగలో నీటిమట్టం గణనీయంగా తగ్గుతోంది.ఈ పరిస్థితులలో నదిలోకి దిగి స్నానాలు చేయడం అపాయకరం. అందుకే పాతాళగంగ ఎగువభాగంలోనూ, పాతాళగంగ స్నానఘట్టాల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాటు . పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, శౌచలయాలకు అన్ని మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులో .
- గంగాభవాని స్నానఘట్టాలు : • ఆలయ పుష్కరిణి సమీపంలో గల గంగాభవాని స్నానఘట్టాల వద్ద కూడా భక్తులు పుణ్యస్నానాలు చేయవచ్చు. ఈ స్నానఘట్టాలలో మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు కూడా మరమ్మతులు చేసి భక్తులకు అందుబాటులోకి.
సామాన్లు భద్రపరిచే గదులు :
- పెద్ద సత్రం వద్ద సామాన్లు భద్రపరిచేగదులు ఏర్పాటు .
- శౌచాలయాలు:
- క్షేత్రపరిధిలో పలుచోట్ల మొత్తం 749 శాశ్వత శౌచాలయాలు అందుబాటులోకి . • వీటిలో 148 స్నానపు గదులు, 36 మూత్రశాలలు, 346 మరుగుదొడ్లు, 8 ఇ – టాయిలెట్లు, 76 మన టాయిలెట్లు, ( నమ్మటాయిలెట్స్) 135 టాటా టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయి. • వీటికి అదనంగా క్షేత్రపరిధిలో తాత్కాలికంగా 120 మరుగుదొడ్లు, వెంకటాపురంలో 20 మరుగుదొడ్లు ఏర్పాట్లు .
- విద్యుద్దీపాలు : • పార్కింగ్ ప్రదేశాలు, భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు. చలువ పందిర్లు, ఆలయ శివవీధులు, ప్రధాన వీధులు మొదలైన చోట్ల లైటింగ్ ఏర్పాట్లు .
కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు .
విద్యుద్దీపాలంకరణ
- ఆలయప్రాంగణం, రథవీధి, క్షేత్రపరిధిలో పలుచోట్ల విద్యుద్దీపాలంకరణ .
- పుష్పాలంకరణ :
- బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా పుష్పాలంకరణకు చర్యలు .
- స్వాగత తోరణాలు • ఉత్సవాలలో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు.
- సాంస్కృతిక కార్యక్రమాలు :
ఆలయ పుష్కరిణి వద్ద భ్రామరీ కళావేదిక, శివదీక్షా శిబిరాల వద్ద నటరాజ కళావేదిక, ఆలయ మాడవీధి (శివవీధి)లోని నిత్యకళారాదన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు.
శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవంలో పలు జానపద కళా రూపాలు ఏర్పాటు .
కమాండ్ కంట్రోల్ రూమ్ • అన్నదాన భవన సముదాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూములో కంట్రోలింగ్ పాయింట్ . • కంట్రోల్ రూములో 15 ఎల్.ఈ.డి టీవీలు అందుబాటులో ఉన్నాయి. • 12 పి.టి.జెడ్ కెమెరాలు, 36 డోమ్ కెమెరాలు, 269 బుల్లెట్ కెమెరాలు, 2 ఫుట్ పాల్ కెమెరాలు,3 వెహికల్ నెంబర్ ప్లేట్ డిటెక్టివ్ కెమెరాలు ఏర్పాటు . ఫ్లెక్సీబోర్డులు :
• ఉత్సవాలలో మొత్తం 1,072 ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు.
మార్గ సూచికబోర్డులు), సమాచారబోర్డులు, కరోనా నివారణ చర్యలకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు.