
శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (05.10.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 1,81,36,794/-లు నగదు రాబడిగా లభించిందని ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 17 రోజులలో సమర్పించారు.
హుండీల లెక్కింపులో 103 గ్రాముల బంగారం, 1 కేజీ 800 గ్రాముల వెండి లభించాయి.
139 యు.ఎస్.ఏ డాలర్లు, 15 యు.ఎ.ఈ. ధైర్హమ్స్ , 10 ఇంగ్లాండ్ పౌండ్స్, 13 కత్తార్ రియాల్స్, 2 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.