ప్రజ్ఞాపూర్ లో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లోని ఊర చెరువు అభివృద్ధికి గాను సుమారు రూ.3 .6కోట్ల నిధులతో చేపట్టే పనులకు మంత్రి హరీష్ రావు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు సుందరీకరణకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు. మిషన్ కాకతీయ పనుల ద్వారా చెరువులు అభివృద్ధి చెంది భూగర్భ జలాలు నిల్వ సామర్థ్యం పెరుగుతుందని మంత్రి చెప్పారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ ఎంపిపి చైనా మల్లయ్య, నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్, గడా ప్రత్యేక అధికారి హనుమంతరావు, నీటిపారుదల శాఖ అధికారులు, కౌన్సిలర్లు, టీఆరెస్ నాయకులు పాల్గొన్నారు.