వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలం పుణ్య క్షేత్రంలో భక్తుల కోలాహలం మరింత పెరిగింది. భక్తుల భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి . దేవస్థానం లోపల , వెలుపల భక్తులు అధికంగా ఉన్నారు. దేవస్థానం వారు క్యూలైన్ల నిర్వహణకు ఏర్పాట్లు చేసారు. పిల్లలు, మహిళలు కూడా ఎక్కువగా కనిపించారు. భక్తులు ఓపికగా పూజల్లో పాల్గొంటున్నారు. మరో వైపు వివిధ శాఖల అధికారులు , ప్రముఖులు కూడా స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ప్రవచనాలు కూడా భక్తులను అలరిస్తున్నాయి . ఈ నెల 23 వ తేదీ నుంచి చాగంటి వారు ప్రవచనాలు చేస్తున్నారు. ప్రవచనాలకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. మల్లికార్జున సుప్రభాతం వైభవం పై వారు ప్రవచనం చేస్తున్నారు .