


జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వ ర స్వామి ఆలయంలో కార్యక్రమం
డింగరి రామాచార్యుల వర్యవేక్షణలో, భాస్కరభట్ల ఆంజనేయశర్మ తిరుప్పావై ఉపన్యాసంలో భాగంగా 9వ పాశురము “తూమణి మాడత్తు” విశేషములు చెప్పారు .
భక్తి గోష్ఠి గానంలో చిన్నారి కోవూరు లక్ష్మి శ్రేయ గానం చేసిన పలు భక్తి గీతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. శ్రీమతి సువర్ణకుమారి బృందం పాడిన భజన, భక్తి గీతాలు అలరించాయి.
ఈ రోజు కార్యక్రమాలని జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు, మేనేజింగ్ ఎడిటర్ www 24x7onlinenews.com సమన్వయం చేసారు.
ఈ కార్యక్రమంలో కోవూరు మాలతీ, చిరంజీవి కోవూరు లక్ష్మణ్ శ్రవణ్, వికాసతరంగిణి అధ్యక్షులు తోట వంశీకృష్ణ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళా శాసనములతో, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, జిల్లెలగూడ, రంగారెడ్డి జిల్లా వారి సౌజన్యంతో, వికాస తరంగిణి మీర్పేట్ సహకారంతో, సీనియర్ జర్నలిస్ట్ వద్ది రాజు జనార్ధన రావు సమర్పణలో, జర్నలిస్ట్ కె.ఎల్. నరసింహా రావు , వేముల రాజేశ్వర రావు సమన్వయంతో, డింగరి రంగాచార్యులు గారి పర్యవేక్షణలో ప్రముఖ ధార్మికోపన్యాసకులు భాస్కరభట్ల ఆంజనేయశర్మ (ఎం.ఏ. జ్యోతిష్యం) చే తిరుప్పావై ప్రవచనములు జరుగుతున్నాయి .
ఈ తిరుప్పావై ప్రవచనములు , భక్తి గోష్ఠి గానం కార్యక్రమాలు ప్రతి రోజు సా|| 6 గంటల నుంచి జరుగుతాయి. జనవరి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు గరుగుతాయిని, అందరూ ఆహ్వానితులే నని వద్ది రాజు జనార్ధన రావు తెలిపారు.