శ్రీశైల భ్రమరాంబ మంగళప్రదాయిని అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ఉద్గాటించారు . శ్రీశైలం దేవస్థానంలో ఆదివారం రెండోరోజు చాగంటి ప్రవచనం చేసారు. మల్లికార్జున సుప్రభాత వైభవం అంశం పై చాగంటి ప్రవచనం చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ కమిషనర్ శ్రీమతి వై.వి.అనురాధ ఈ ప్రవచనానికి హాజరయ్యారు . ముందుగా వేదపండితులు, అర్చక స్వాములు జ్యోతి ప్రజ్వలన చేసారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి చాగంటి వారిని వేదికపైకి ఆహ్వానించారు. వీక్షణ శక్తితో ఆ జగన్మాత భక్తులను కటాక్షిస్తున్దన్నారు . లోక రక్షణ కోసం అమ్మ వారు రాక్షక సంహారం చేసిందన్నారు. అరుణాసురుడనే రాక్షసుని సంహరించేందుకు ఆదిపరాశక్తి భ్రమర రూపాన్ని అంటే తుమ్మెద రూపాన్ని ధరించిన్ధన్నారు. శ్రీశైల క్షేత్రంలో శివపార్వతులు సదా కొలువుతీరి ఉంటారని వివరించారు. పరమేశ్వరుడు 63 రూపాలను ధరించారన్నారు. శ్రీశైల సుప్రభాతాన్ని చదవడమే కాకుండా శ్రవణం చేయడం ఫలదాయకమన్నారు , మనసుని భగవంతునిపై లగ్నం చేసినప్పుడే భగవత్ భక్తి అలవడుతున్దన్నారు.