రైతు సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని భైంసా ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడడంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు.