దుబాయిలోని అబుదాబిలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన తెలంగాణ కార్మికుల కుటుంబాలకు పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్నారై శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వారి మృతదేహాలను త్వరగా ఇండియాకు తీసుకువచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఘటన జరిగిన నాటి నుంచి తమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.