ప్రధానాలయానికి ఎదురుగా  రహదారి పనులు ప్రారంభం

 శ్రీశైల దేవస్థానం:ప్రధానాలయానికి ఎదురుగా  రహదారి పనులు బుధవారం  ప్రారంభమయ్యాయి. కార్యనిర్వహణాధికారి  ఎం.శ్రీనివాసరావు సంప్రదాయబద్దంగా పూజాదికాలు జరిపి ఈ రహదారి పనులు ప్రారంభించారు.ప్రస్తుతం గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు తారురోడ్డు పనులను చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 30 అడుగుల రహదారిని రెండు వైపుల అనగా కుడి, ఎడమ వైపులలో 15 అడుగుల మేర విస్తరింపజేసి మొత్తం 60 అడుగుల వెడల్పుతో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది.

ఈ 60 అడుగుల రహదారి పనులు పూర్తయిన పిదప రెండు వైపులా కూడా నడకదారులు (ఫుట్పాత్లు ) నిర్మిస్తారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలలో జరిగే రథోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా 60 అడుగుల విస్తీర్ణంతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

అదే విధంగా నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే రహదారికి ఇరువైపులా సుందరీకరణ పనులు కూడా చేపడుతారు.

కాగా ఈ రోజు జరిగిన నిర్మాణ పనులు ప్రారంభ కార్యక్రమంలో  శ్రీస్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, ఇంచార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు పి. చంద్రశేఖరశాస్త్రి, సహాయ ఇంజనీరు సీతారమేష్ తదితరులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.