
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట వద్ద చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం పరిశీలించారు. అధికారులు సమన్వయం తో వ్యవహారించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదేశించారు. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. వేదిక వద్దనే పోలీసు, GHMC, R&B, I&PR, సాంస్కృతిక , రెవెన్యూ శాఖల అధికారులతో ఏర్పాట్లను సి. ఎస్. సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో టిఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పి ఆర్. కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా , జి.హెచ్.యం.సి కమి షనర్ లోకేశ్ కుమార్ , అడిషనల్ డిజిపి (Law & Order) జితేందర్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శేషాద్రి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అరవిందర్ సింగ్, I&PR విభాగం అదనపు డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ , ఇతర పోలీసు, GAD, GHMC అధికారులు పాల్గొన్నారు.