
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (25.07.2021) న రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచారపూజలు జరిపారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం జరిపారు.
అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ పల్లకి – ఉత్సవాన్ని జరిపారు.