ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతమైందని వామపక్ష తదితర పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేసారు .పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వైయస్ఆర్ సీపీ ఎంపీలు ధర్నా చేసారు .ఏపీ విభజన చట్టం హామీలు అమలు చేయాలని నినాదాలు చేసారు .బంద్లో వైయస్ జగన్
ప్లకార్డు చేతబూని నిరసన వ్యక్తం చేసారు . నెల్లూరు జిల్లా దండిగం గ్రామం వద్ద వైయస్ జగన్ ఆందోళన చేసారు .నెల్లూరు జిల్లా ఏఎన్ మండలం దండిగం గ్రామం వద్ద ఆయన ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేశారు.ఆయనతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
ఏపీ బంద్కు వైయస్ జగన్ తన సంపూర్ణ సంఘీభావాన్ని తెలిపారు.ఏపీ బంద్ లో న్యాయవాదులు హల్చల్ చేశారు. రాయలసీమలో హైకోర్టు.. మా హక్కు అంటూ గత 19 రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా కోర్టులు బహిష్కరించి నిరసనలు తెలియజేస్తున్న న్యాయవాదులు బంద్ లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జట్లు.. జట్లుగా ఏర్పడి బైకు ర్యాలీలు నిర్వహిస్తూ, నినాదాలు చేస్తూ, అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట బైఠాయించేందుకు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం చెప్పడంతో రోడ్డుపై నిలబడి ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్.. డౌన్ సీఎం.. తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున నినానదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు జోక్యం చేసుకున్నారు. రోడ్లపై పాదచారులు.. వాహనాలు చాలాసేపు నిలబడిపోవడంతో ట్రాఫిక్ జాం అయింది.
కర్నూలులో జనసేన కార్యకర్తలు సందడి చేశారు. పార్టీ జిల్లా ఇంచార్జ్ సురేష్ ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు రోడ్లపై ర్యాలీలు నిర్వహించారు. ఉదయం నుంచి ర్యాలీలు నిర్వహిస్తూ.. బీజేపీ, మోడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వుయ్.. వాంట్ జస్టిస్ అని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ ఎదుట మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలియజేశారు. పార్టీ ఇంచార్జ్ సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు న్యాయం చేయాలన్నారు.
ఏపీ బంద్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తలు భారీ ర్యాలీలతో హోరెత్తించారు.
కర్నూలులో జరిగిన నిరసనల్లో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధితోపాటు.. ఎమ్మెల్సీ కె.ఇ.ప్రభాకర్, యువనేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్… మాజీ మేయర్ బంగి అనంతయ్య, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడిసిసి బ్యాంక్ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు తమ అనుచరులతో కలసి నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు.