హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం అనేక కార్యక్రమాలు చేపడుతోంది . ఇందులో భాగంగా దోర్నాలలో శనివారం శ్రీ స్వామి అమ్మ వారి కల్యాణోత్సవం జరిగింది . స్థానిక శివసదనంలో ఈ కార్యక్రమం కన్నులవిందుగా జరిగింది .దేవస్థానం వారు తగిన ఏర్పాట్లు చేసారు. భక్తి భావనను పెంచడానికి , ఆధ్యాత్మిక చింతనను కలిగించడానికి హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా దేవస్థానం వారు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు .