v2శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో అధ్యయన ఉత్సవాలలో భాగంగా నాచ్చియార్ తిరుమొళి శాత్తుమోరై జరిగింది. సోమవారం నాటి వేడుకల్లో ఆముక్తమాల్యద( గోదాదేవి) తన సన్నిధి నుంచి ప్రహ్లాదవరదుల సన్నిధికి వేంచేశారు.
ఆముక్తమాల్యద(గోదాదేవి) సమర్పించినట్లుగా అర్చకులు నాచ్చియార్ తిరుమొళి పాశురాలు పఠిస్తూ, “పాల పాయసాన్ని” స్వామికి నివేదించారు.అనంతరం ఆండాళ్ అమ్మవారు ప్రహ్లాదవరదులతో గర్భగృహంలో వేంచేశారు.అనంతరం శాత్తుమోరై జరిగింది.అమృత తుల్యమైన ఆ పాల పాయసాన్ని భక్తులందరికి అందించారు.
*సంవత్సరం లో కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఆముక్తమాల్యద( గోదాదేవి) ప్రధాన సన్నిధిలో గర్భగృహంలో ప్రహ్లాదవరదులతో పాటు వేంచేస్తారు.*