ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రాం, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్ర గ్రంథాలయ శాఖ బుక్ స్టాల్, T SAT స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్
- తమ కలం, గళం ద్వారా సమాజానికి చైతన్యాన్ని అందించడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారులపేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం ద్వారా సందేశాన్ని ఇచ్చారు…
- సాయుధ రైతాంగ పోరాటం, తొలి , మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా చర్రిత కొంత వక్రీకరణకు గురైంది..
- తెలంగాణ ఉద్యమంలో సమిధ లైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికేఎక్కువ పేరు వచ్చింది..
- తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలి..
- చదివిన పుస్తకాలు, చైతన్య పర్చిన గానం నుంచి క్రోడీకరించి నేను ఉమ్మడి ఎపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పైన మాట్లాడాను..
- సాంకేతిక పరిజ్జానం పెరగడంతో డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోంది..
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహించడం ద్వారా వచ్చే తరానికి స్పూర్తినిస్తున్నారు..
- చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలం..
- హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుంది..
- మంచి సందేశం ఇవ్వడం కోసమే బుక్ ఫెయిర్ లో నేను, మా మంత్రులు పాల్గొన్నాం..
- సామాజిక చైతన్యం , సమాజంలో వచ్చే మార్పుల పై చర్చించడానికి బుక్ ఫెయిర్ మంచి వేదిక గా ఉంటుంది..
- కొత్త తరానికి తెలిసింది గూగుల్ మాత్రమే..
- చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన వారికి చరిత్ర తెలుస్తుంది..
- పోరాడి అమరులైన వారి గురించి చరిత్ర కారులు రాస్తేనే తెలుస్తుంది..
- తమకనుకూలంగా రాయించుకున్న చరిత్ర నే అసలైన చరిత్ర అని గత పదేళ్ల నుంచి కొందరు ప్రచారం చేయించుకుంటున్నారు..
- చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నాం..
- కాళోజీ, దాశరథి లాంటి కవులెందరోతెలంగాణ తొలి ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారు..
- అందె శ్రీ, గూడ అంజయ్య, గద్దర్ లాంటి వారు మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిఇచ్చారు..
- నిజమైన చరిత్రను తెలియజేయడానికి ఏర్పాటైన పుసక్త ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుంది.