శ్రీశైల దేవస్థానం: హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,96,92,376/- నగదు రాబడిగా లభించిందని ఈ ఓ శ్రీనివాస రావు తెలిపారు. మంగళవారం జరిగిన ఈ హుండీ లెక్కింపు ఆదాయాన్ని భక్తులు గత 26 రోజులలో (19.11.2024 నుండి 16.12.2024వరకు) సమర్పించారన్నారు.ఈ నగదుతో పాటు 232 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 850 గ్రాముల వెండి లభించాయని వివరించారు. యుఎస్ఏ డాలర్లు – 558, సౌదీఅరేబియా రియాల్స్ – 3, ఓమన్ బైసా – 200, కువైట్ దినార్ 12, కత్తారు రియాల్స్ – 4, సింగపూర్ డాలర్లు 7, ఆస్ట్రేలియా డాలర్లు – 60, కెనడా డాలర్లు – 35, హాంకాంగ్ డాలర్లు 10, యూకే ఫౌండ్స్ – 5, ఈరోస్ 115, కెన్యాషిల్లింగ్స్ -50, ఫిలిపిన్స్ పిసో – 20, యూఏఈ దిర్హమ్సు – 15, జాంబియా క్వచ – 20, జపాన్ యన్స్ – 1000మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని తెలిపారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు జరిగిందని,ఈ కార్యక్రమంలో యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 5,96,92,376/- నగదు రాబడి-ఈ ఓ శ్రీనివాస రావు
![](https://onlinenewsdiary.com/wp-content/uploads/2024/12/9270a0d2-7241-4f72-8321-619e65148725-1.jpeg)