ప్రజావాణి కార్యక్రమంలో 2202 దరఖాస్తులు
హైదరాబాద్, డిసెంబర్ 22:మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2202 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజా వాణిలో ఎక్కువగా 40 శాతం మేరకు డబుల్ బెడ్ రూమ్, 30 శాతం మేరకు పెన్షన్ లకు సంబంధించినవి కాగా, మిగిలినవి ఉద్యోగాలు, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకున్నారని ప్రజా భవన్ అధికారులు తెలిపారు.
Post Comment