శ్రీశైల దేవస్థానం:| ఈ రోజు 16న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 1,43,88,289/-లు నగదు రాబడిగా లభించింది.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 27 రోజులలో సమర్పించారు. అక్కమహాదేవి అలంకార మండపములో ఈ హుండీ లెక్కింపు చేసారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేసారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.