అమరావతి:ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రం శ్రీశైలంలో కుమార విహారం పేరుతో నిర్మించనున్న కుమారస్వామి ఆలయ ప్రాజెక్ట్ను ఆవిష్కరించేందుకు సీఎం వైఎస్ జగన్ను శృంగేరి శారదాపీఠం ప్రతినిధులు ఆహ్వానించారు.
ఆధ్యాత్మిక, భక్తి భావం ప్రజల్లో పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతతతో కూడిన జీవనం సాధ్యమవుతుందన్న సీఎం వైఎస్ జగన్
శృంగేరి శారదాపీఠం ఆధ్వర్యంలో నిర్మించనున్న కుమార విహారం ప్రాజెక్ట్లో భాగంగా 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి దేవాలయం నిర్మించనున్నారు . 2022 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తిచేయాలనే లక్ష్యం.
సీఎం వైఎస్ జగన్కు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించిన ప్రతినిధులు. శృంగేరి శారదా పీఠాధిపతి భారతీ తీర్ధస్వామి వారి దివ్య ఆశీస్సులతో, సూచనలతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు సీఎంకి ప్రతినిధులు వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శృంగేరి శారదా పీఠాధిపతి ప్రతినిధులు, ప్రిన్సిపల్ కన్సల్టెంట్స్ విబి టెక్నోక్రాట్స్ బృందం బి. లక్ష్మీ ప్రభాకర్, చిన్నబాబు, విజయభాస్కర్, శేషుస్వామి, అరుణ్శర్మ పాల్గొన్నారు.
*Datthaathreya special puja performed in Srisaila Temple on 10th Sep.2020.