తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దొరికారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించి శనివారం నాటికి ఏడాది పూర్తవుతుందని ఆమె గుర్తు చేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాదిలోనే సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశారని లక్ష్మీ పార్వతి కొనియాడారు. చంద్రబాబు, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 25ఏళ్లు గడిచాయన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదన్నారు.