
సుప్రసిద్ధ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు మృతికి బీసీ కమిషన్ ఛైర్మన్ బి ఎస్ రాములు తీవ్ర సంతాపం ప్రకటించారు.
వేదగిరి రాంబాబు ఏక కాలంలో అనేక కర్తవ్యాలు నిర్వర్తించారు,రచయితగా రచనలు చేసారు , సంపాదకులుగా , ప్రచురణ కర్తగా ఎంతోమంది రచనలు ప్రచురించారు, అకాడమీ స్థాయిలో స్వంత డబ్బు ఖర్చు చేసి ఎనలేని సేవ చేసారు,
మూడు దశాబ్దాలుపైగా కథానిక కోసం ఎంత చేసారో లెక్కలకందదు,రాంబాబు జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేసారు, తెలుగు సాహిత్య చరిత్ర లో వారిది ఒక ప్రత్యేక అధ్యాయం అని నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు.