మానవ జీవితం ఎంతో ఉత్క్రుష్టమైనదని , ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదని , మన వంతు ప్రయత్నంగా ఈ జీవితం విలువ పెంచాలని శృంగేరి శారదాపీఠ ఉత్తరాధికారి శ్రీ విధు శేఖర భారతీ స్వామి పిలుపు ఇచ్చారు . శ్రీ స్వామి వారు బుధవారం సాయంత్రం భక్తకోటికి అనుగ్రహభాషణం చేసారు . శ్రీశైల ఆలయ దక్షిణ మాడ వీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి అనుగ్రహ ప్రవచనం చేసారు . కాలం ఎంతో విలువైనదని , ఇలాంటి గొప్ప కాలాన్ని వృధా చేయకుండా ధార్మిక చింతనతో గడపాలన్నారు . భగవత్ ఆరాధనతో జీవితం విలువలు పెంచాలన్నారు . ప్రతి ఒక్కరూ తమ లౌకిక జీవనాన్ని విఘాతం కలగకుండా కొనసాగిస్థూ భగవంతుని ఆరాధన చేయవచ్చునన్నారు . పరమేశ్వరుడు భక్త సులభుడని, పరమేశ్వరుడి ఆరాధన వలన జనులు సంపూర్ణ శ్రేయస్సు పొందవచ్చునని శ్రీ స్వామి వారు పేర్కొన్నారు . పరమేశ్వరుడి కటాక్షం కొందరికే పరిమితం కాదని , భక్తితో ఎవరైనా ఆయన అనుగ్రహం పొందవచ్చునని వివరించారు .భగవత్ ఆరాధనకు ఎన్నో మార్గాలను మన శాస్త్రాలు నిర్దేశిన్చాయన్నారు. హోమం , అర్చన , పారాయణ , జపం , నామ స్మరణ ,భజన మొదలైనవి భగవంతుని చేరువచేసే మార్గాలన్నారు . శివానందలహరిలోని పలు శ్లోకాలను పేర్కొని వాటి అర్థవిశేషాలను చెప్పారు .శివలీలల విశేషాలను వివరించారు . శ్రీశైల క్షేత్ర వివరాలు , శివ తత్వం , అమ్మవారి తత్వాన్ని , వైదిక ధర్మ అంశాలను ప్రస్తావించారు . శ్రీశైల క్షేత్రం మహిమాన్వితమైనదని , శంకర భగవత్పాదుల వారు కొంత కాలం ఇక్కడ తపస్సు ఆచరించి శివానందలహరి, సౌందర్య లహరి గ్రంధాలను రచన చేసారని స్వామి వారు చెప్పారు . జనులందరికి శ్రీశైల స్వామి అమ్మవార్ల క్రుపావిశేషం లభించాలని ఆశీర్వదించారు .
గోసంరక్షణకు శృంగేరి పీఠం విరాళం
గోసంరక్షణకు శృంగేరి పీఠం విరాళం ప్రకటించారు శ్రీ స్వామి వారు . ఈ సాయంత్రం దేవస్థానం గోశాలను స్వామి వారు సందర్శించారు . దేవస్థానం గోసంరక్షణ పథకానికి శృంగేరి పీఠం తరఫున రూ . 1,11,116/- విరాళంగా ప్రకటించారు .కాగా దేవస్థానం పునర్నిర్మిస్తున్న ఘంటామఠం, విభూది మఠం, రుద్రాక్ష మఠాలను పరిశీలించారు . ఆలయ మాడవీధులను సందర్శించారు . స్వామి వారి వెంట అధికారులు , అర్చక స్వాములు ఉన్నారు .