కర్నూలు జిల్లా ఆత్మకూర్ మండలంలో సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టారు. దీనివల్ల 25 వేల ఎకరాలకు నీరు అందుతుంది . ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే.ఇ. కృష్ణ మూర్తి , పర్యాటక శాఖ మంత్రి బి. అఖిల ప్రియ , ఎంపీ . రేణుక , ఎమ్మెల్యే బి. రాజశేఖర రెడ్డి , అధికార అనధికార ప్రముఖులు హాజరయ్యారు . -courtesy{ దిన్నె సురేష్ కుమార్, ఆత్మకూర్ }