
నంద్యాల:శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ IPS , నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ IPS .
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత చర్యలను నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తో కలిసి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ IPS పరిశీలించారు.
శ్రీశైలం దేవస్థానంలోని క్యూ లైన్ లు ,గుడి పరిసరాలు పరిశీలించారు.
cc కెమెరాల కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు.
*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం
కలగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు
ఈ కార్యక్రమంలో కర్నూల్ రేంజ్ డీఐజీ తో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ , డీఎస్పీ రామాంజి నాయక్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఉన్నారు.