
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి.
యాగశాలలో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు . అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేశారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి..
ఈ సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పపల్లకీసేవ ప్రత్యేకం.
ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు ప్రత్యేకం.
తదుపరి పుష్పపల్లకి మేళతాళాలతో శ్రీ స్వామిఅమ్మవార్లను తొడ్కొని వచ్చి వివిధపుష్పాలతో అలంకరించబడిన పుష్పపల్లకిలో ఊరేగింపు స్పెషల్.
కాగా ఈ విశేష సేవలో ఎర్రబంతి, పసుపు బంతి, తెల్లచేమంతి, పసుపు చేమంతి, కనకాంబరాలు, మల్లెలు, డచ్స్, అశోక పత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్, అస్పెర్ గ్రాస్, జబ్రా, కార్నేషన్, ఆర్కిడ్స్, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పలు రకాల పుష్పాలను వినియోగించడం ప్రత్యేకం.
పురాణాలలో శ్రీశైల మల్లికార్జునస్వామివారు పుష్పప్రియుడని చెప్పబడింది. ఈ కారణంగానే ఆయా కైంకర్యాలన్నీ శ్రీ స్వామివారికి పరిపూర్ణంగా అర్పింపజేయాలనే భావనతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలోనూ, దసరా మహోత్సవాలలోనూ ఈ పుష్పపల్లకీ సేవ నిర్వహించడం ఆనవాయితీ.
*మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మెట్ల ద్వారా పాతాళ గంగ చేరుకొని భక్తులను పరామర్శిస్తున్న జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి , జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్.
*యాంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.