
నంద్యాల: *శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గుడి పరిసరాలు, క్యూ లైన్ లను పరిశీలన
*కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సమయమనం పాటిస్తూ దర్శనం చేసుకోవాలి
*విధులలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
*అడిషనల్ ఎస్పి యుగంధర్ బాబు
నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు శ్రీశైలం లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరిశీలించారు. శ్రీశైలానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన క్యూలైన్స్,గుడి పరిసరాలు మొదలగు వాటిని పరిశీలించి అక్కడ విధులలో ఉన్న ఆలయ అధికారులకు , పోలీస్ అధికారులకు ,సిబ్బందికి పలు సూచనలు చేశారు.
➡️క్యూలైన్ లలో వేచివున్న భక్తులకు మంచి నీరు, టాయిలెట్స్ ఇలా కనీస సదుపాయాలు కల్పించాలి
➡️కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు సమయమనం పాటిస్తూ ఎలాంటి తొక్కిసలాటకు తావు లేకుండా దర్శనం చేసుకోవాలని సూచించారు.
➡️భక్తులకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే మందులు అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంచుకోవాలి.
➡️క్యులైన్స్ లలో ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా అక్కడ విధులలో ఉన్న సిబ్బంది అప్రమతంగా ఉండాలి.
➡️ఆలయ పరిసరాల్లో బందోబస్తు లో ఉన్న సిబ్బంది అధికారులు నిరంతరము అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
➡️క్యూలైన్ లలో వేచివున్న భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో సహేతుకమైన కారణాలను మైక్ ల ద్వారా సమాచారం అందించాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ తో పాటు టెంపుల్ AE వేణు , స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.