కనకదుర్గమ్మ అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పణ
శ్రీశైల దేవస్థానం:విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శనివారం ఉదయం శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం లో అమ్మవారికి పట్టుచీర, పూలు, పలు రకాల ఫలాలు, గాజులు మొదలైనవి సమర్పించారు.
అదేవిధంగా శ్రీమల్లేశ్వరస్వామివారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ మేరకు శ్రీశైల దేవస్థానం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులు, అమ్మవారి ప్రధానార్చకులు పి. మార్కండేయశాస్త్రి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అర్చకులు, వేదపండితులు పోలేపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం, సంబంధిత సిబ్బంది ఈ సారెను సమర్పించారు.
కాగా సారెతో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావు, సంబంధిత అధికారులు, అర్చకులు, వేదపండితులు తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం దేవస్థానం తరుపున అమ్మవారికి సారె, స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు. తరువాత ఈ దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు దంపతులను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం వారు వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
చివరగా ఈ దేవస్థానం తరుపున కూడా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారికి శేషవస్త్రాలు, ప్రసాదాలను కూడా అందించారు
Post Comment