శివపార్వతుల కల్యాణంపై వై.నాగరాజు భాగవతార్, మైదుకూరు, కడప జిల్లా హరికథ గానం
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం వై.నాగరాజు భాగవతార్, మైదుకూరు, కడప జిల్లా శివపార్వతుల కల్యాణం పై హరికథ గానం చేశారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ హరికథ కార్యక్రమం జరిగింది.
హార్మోనియం సహకారాన్ని వై. జయకృష్ణ, తబలా సహకారాన్ని వై. సుధాకర్ అందించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Post Comment