శ్రీశైల దేవస్థానం:శుక్రవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ3,43,68,091/- నగదు
రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు. ఆలయ హుండీల ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో (14.07.2023 నుండి 11.08.2023 వరకు) సమర్పించారన్నారు.ఈ హుండీలో 172 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారు, 10 కేజీల 350 గ్రాముల వెండి లభించాయని తెలిపారు.
అదేవిధంగా 940 – యుఎస్ఏ డాలర్లు, 150 – ఆస్ట్రేలియా డాలర్లు, 4 మలేషియా రింగిట్స్, 70- కెనెడా రింగిట్స్ 80 యూకే పౌండ్సు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయని ఈ ఓ వివరించారు.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టామని తెలిపారు.ఈ హుండీల లెక్కింపులో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది , శివసేవకులు పాల్గొన్నారు.