ప్రధాన రహదారి నిర్మాణాన్ని పరిశీలించిన ధర్మకర్తల మండలి
శ్రీశైల దేవస్థానం:ప్రధానాలయానికి తూర్పుభాగంలో నిర్మిస్తున్న ప్రధాన రహదారి నిర్మాణాన్ని సోమవారం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి పరిశీలించారు. పరిశీలనలో ధర్మకర్తల మండలి సభ్యులు జి. నరసింహారెడ్డి, మేరాజోత్ హనుమంతునాయక్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజులు పాల్గొన్నారు. రూ. 80 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణానికి ఈ నెల 12వ తేదీన భూమిపూజ జరిగింది.
పరిశీలనలో ముందుగా ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ రహదారి నిర్మాణం గురించి వివరించారు.
ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీలలితాంబిక వాణిజ్య సముదాయాన్ని కూడా పరిశీలించారు.
Post Comment