దేవాలయంలోకి అడుగుపెట్టినవారు ప్రశాంతంగా ఉండాలని , ఆలయంలో కోపం పనికిరాదని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సూచించారు. శ్రీశైలంలో పుష్కరిణిని వద్ద వేదికపై వద్దిపర్తి ప్రవచనం చేస్తున్నారు. మహాసహస్రావధాని వద్దిపర్తి ఆదివారం ఆరోరోజు అర్ధనారీశ్వరతత్త్వంపై ప్రవచనం చేసారు. శివుడు కరుణామూర్తి అని పేర్కొన్నారు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చే కరుణ కలిగిన పరమేశ్వరుడని వివరించారు. శ్రీశైల మల్లికార్జునుడు అప్పుడప్పుడు భక్తుల సహనాన్ని పరీక్షిస్తాడని పేర్కొన్నారు. ఇస్తాడని చెప్పారు. భక్తులు తమ సమస్తాన్ని భగవంతుడికి ఇచ్చి తరిస్తారని పేర్కొన్నారు. శివుడికి భక్తి ముఖ్యమని , కులధనాదులు కాదని చెప్పారు. వద్దిపర్తి ప్రవచనం అందరిని అలరిస్తోంది. ప్రవచనానికి ముందు దేవస్థానం వారు వద్దిపర్తికి పూలమాలవేసి స్వాగతం పలికారు. బ్రహ్మశ్రీ వేదికపై జ్యోతిని వెలిగించారు.