వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన తన 16వ రోజు పాదయాత్రను పత్తికొండ నియోజక నియోజకవర్గం వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభించారు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటున్నారు. 15వ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్ రెండు వందల కిలోమీటర్ల మార్కును చేరుకున్న విషయం తెలిసిందే.సర్పరజపురం జగన్ విడిది కేంద్రం వద్ద జగన్ ను ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, తూర్పుగొదావరి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు కలిశారు . వైఎస్సార్ సిపిలో చేరిన దొమ్మేటికి కండువా కప్పి పార్టిలో చేర్చుకున్నారు .
వైయస్ జగన్ ను కలిసిన అక్షయ్ గోల్డ్ బాధితులు..
వైయస్ జగన్ ఎదుట కన్నీరు మున్నీరైన సురేష్ బాబు అనే ఏజెంట్, అగ్రిగోల్డ్ , అక్షయ్ గోల్డ్ లాంటి మోసాలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడా ,అయినా ప్రభుత్వం బాధితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు, ఏడాది పాటు ఓపిక పట్టండి ,బాధితులందరికీ న్యాయంచేస్తానని వైయస్ జగన్ చెప్పారు .