వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ దంపతులు ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, కడియం శ్రీహరి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కే.స్వామి గౌడ్ , రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, తుమ్మల నాగేశ్వర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , టి. పద్మారావు గౌడ్ , పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.