హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చైనా ప్రతినిధులు తెలిపారు. మేయర్ బొంతు రామ్మోహన్ తో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. హైదరాబాద్ తో సిస్టర్ సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని చైనా ప్రతినిధులు చెప్పారు. చైనాలోని లియాండూ నగరాన్ని సందర్శించాల్సిందిగా మేయర్ ను కోరారు. ఈ సందర్భంగా చార్మినార్ మెమెంటోను మేయర్ రామ్మోహన్ వారికి బహూకరించారు.