శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.1,81,91,821 /- లు నగదు రాబడిగా లభించాయి.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 20 రోజులలో సమర్పించారు. పై నగదుతో పాటు 270 గ్రాముల బంగారు, 1 కేజి 980 గ్రాముల వెండి లభించాయి.
50 ఇంగ్లాండ్ పౌండ్స్, 10 కెనడా డాలర్లు, O2 సింగపూర్ డాలర్లు, 23 యు ఎస్ ఏ డాలర్లు, 01 ఎస్.ఏ.యు రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
*Kumaraswaamy puja, Nandheeshwara puja, Bayalu Veerabhadra swaamy puja performed on this day with temple traditions. E.O. participated in the puja.