శ్రీశైల దేవస్థానం: ఈ రోజు (15.12.2020)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.3,61,34,086/- లు నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 21 రోజులలో సమర్పించారు.
పై నగదుతో పాటు 262 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 6 కేజీల 165 గ్రాముల వెండి లభించాయి.
160 యు ఎస్ ఏ డాలర్లు, 141 సౌదీరియాల్స్, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 2 కత్తార్ రియాల్స్, 10 సౌత్ ఆఫ్రికా రాండ్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.