శ్రీశైలం దేవస్థానం వారు నిర్వహిస్తున్న కళానీరాజనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం డాక్టర్ జయప్రద రామ్మూర్తి ( హైదరాబాద్) వేణుగానం సమర్పించారు . ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వేదికపై ఈ సాయంత్రం వేణుగానం చేసారు . పాణ్యం దక్షిణామూర్తి ,కాపవరపు సుబ్బారావు , ఆర్పీ రాజు, కుమారి సువర్చల వాయిద్య సహకారాన్ని అందించారు .