శ్రీశైలం దేవస్థానంలో వార్షిక ఆరుద్రోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి సోమవారం రాత్రి ఈ కార్యక్రమాన్ని జరిపారు. శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం , అన్నాభిషేకం జరిపారు . మంగళవారం ఉదయం వేకువ పూజల అనంతరం ఉత్తర ద్వార దర్శనం, నందివాహనసేవ , గ్రామోత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి గణపతి పూజ జరిపారు. లోక కల్యాణం కోసం సంకల్పం చదివారు . దేశం సుభిక్షంగా ఉండాలని , సుఖశాంతులు విలసిల్లాలని , అకాల మరణాలు జరగరాదని సంకల్పం చెప్పారు . రుద్రాభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా జరిపారు . ఏక కాలంలో 11 మంది ఆలయ అర్చక స్వాములు , వేద పండితులు రుద్ర మంత్రాలను పఠిస్తూ అభిషేకం నిర్వహించారు . స్వామి వారికి అన్నభిషేకం జరిపారు . మంగళవారం వేకువ పూజల అనంతరం శ్రీ స్వామి వార్ల ఉత్సవ మూర్తులను శ్రీ స్వామి వారి ఆలయ ముఖ మండపంలో ఉత్తర ముఖంగావే0చేపు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు . తరువాత ముఖ మండప ఉత్తర ద్వారాన్ని తెరిచి భక్తులకు దర్శనం కల్పించారు . ఉదయం గం . 6.౦౦ లకు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీ స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి తోడ్కొని వచ్చి ఆలయ ఉత్తర భాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు . అనంతరం రావణ వాహనంపై వేoచేపు చేయించి గ్రామ ఉత్సవాన్ని జరిపారు . ఈ ఉత్సవాలు భక్తులను అలరించాయి . దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేసారు .